రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులతో ఢిల్లీలో పరేడ్
రాజీనామాలు చేసిన అన్ని పార్టీల నేతలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీన తలపెట్టిన రైల్ రోకోను రద్దు చేసి, ఆ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన 137 మంది ప్రజాప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ హైదరాబాదులో కాకుండా న్యూఢిల్లీలో పరేడ్ నిర్వహించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాజీనామాలు చేసిన అందరితో కలిసి ప్రధానమంత్రిని సైతం కలవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని అపాయింటుమెంటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ముందు సైతం రాజీనామా చేసిన వారితో పరేడ్ నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తున్న రైల్ రోకో కార్యక్రమం ద్వారానే ఉత్తర భారతదేశానికి తెలంగాణ సెంటిమెంటును తెలియజేసినట్టుగా జెఏసి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.