చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళానిధి మారన్‌పై స్వామి నిత్యానంద ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nithyananda Swami
చెన్నై‌: సన్ నెట్‌వర్క్ యజమాని కళానిధి మారన్‌పై నిత్యానంద ఆశ్రమం గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిత్యానంద నటి రంజితతో రాసలీలలను నడుపుతున్నట్లు చూపడానికి మార్ఫింగ్ ఫొటోలు ప్రసారం చేశారనే ఆరోపణపై ఆశ్రమం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగర పోలీసు కమిషనర్‌ జెకె త్రిపాఠీకి బెంగుళూర్ కేంద్ర కార్యాలయంగా ఉన్న నిత్యానంద ధ్యానపీఠం ఫిర్యాదును అందజేసింది.

సన్ నెట్‌వర్క్ ప్రసారం చేసిన టీవీ ఫుటేజ్‌లు తమ ఆశ్రమం ప్రతిష్టను దెబ్బ తీసిందని ధ్యానపీఠానికి చెందిన నిత్యశర్వానంద చెప్పారు. దాని వల్లనే సంస్థ యజమాని కళానిధి మారన్‌పై, సిఒఒ హన్సరాజ్ సక్సేనాపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కళానిధి మారన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన దయానిధి మారన్ సోదరుడు. ఆ ఫుటేజ్‌ని ప్రసారం చేయడం కుట్ర అని పీఠం అంటోంది. సేలం డిస్ట్రిబ్యూటర్ ఒకరు చేసిన ఫిర్యాదుతో ఇప్పటికే సక్సేనా చీటింగ్ కేసులో పోలీసు కస్టడీలో ఉన్నాడు.

English summary
The Nithyananda ashram on Thursday filed a police complaint accusing Sun Network owner Kalanidhi Maran and its top executive of morphing and telecasting visuals showing the controversial spiritual guru in a compromising position with an actress last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X