వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఓ దోపిడీదారు, స్పష్టత లేదు: ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
కరీంనగర్: తెలంగాణ కోసం ఉద్యమం అంటున్న వారు సీమాంధ్రులతో కలిసి వ్యాపారాలు చేస్తుండగా తప్పులేనప్పుడు తాము సీమాంధ్ర బస్సులో యాత్ర చేస్తే తప్పు ఏంటని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం తెలంగాణ రాష్ట్ర సమితిపై ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవడం టిఆర్ఎస్‌కు సమంజసం కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన వంటా వార్పు, రైలు రోకో కార్యక్రమాలు తమకు పోటీగా పెట్టినవేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అంగీకారంతోనే బస్సు యాత్ర చేపట్టామని అన్నారు.

సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు చేస్తున్న యాత్ర మూర్ఖపు యాత్ర అని ఎర్రబెల్లి విమర్శించారు. తెలంగాణపై వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై ముందుగా జగన్ వర్గానికి చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే కొండా సురేఖకే క్లారిటీ లేదని విమర్శించారు. వైయస్ జగన్ ఓ దోపిడీదారు అన్నారు. ఆయనకు తెలంగాణపై స్పష్టత లేదన్నారు. ప్రతి తెలంగాణ వాదికి ఆచార్య జయశంకర్ ఫోటో పెట్టుకునే అర్హత ఉందన్నారు.

English summary
Telugudesam Party senior mla Errabelli Dayakar Rao blamed Telangana Rastra Samiti for business with seemandhra leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X