విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విడగొడితే మూడు ముక్కలు చేయాలి: వంగపండు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vanga Pandu
విశాఖపట్నం: రాష్ట్రాన్ని విడగొట్టడమంటూ జరిగితే మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలని, తెలంగాణ, సీమాంధ్ర పేరుతో ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజా గాయకుడు వంగపండు విశాఖపట్నంలో డిమాండ్ చేశారు. ఆయన ఉత్తరాంధ్ర కోరుతూ శుక్రవారం సైకిల్ యాత్ర చేసిన వారి అరెస్టుకు నిరసనగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వంగపండు రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్రను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర అన్నారు. రాష్ట్రం విడిపోతే విశాఖపట్నంను రాజధానిగా చేసి లక్షకోట్ల ప్యాకేజి ప్రకటించాలని డిమాండ్ చేశారు. జై ఉత్తరాంధ్ర అంటూ నినాదాలు చేసి తనదైన శైలిలో గైయాలాపనతో నృత్యం చేస్తూ అందరినీ అలరించారు.

English summary
Praja Gayakudu Vangapandu demanded that to divide three parts. He said uttarandhra is very backward area in world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X