మొయిలీ తోక కట్, జైరాం రమేష్కు ప్రమోషన్
జయంతి నటరాజన్కు పర్యావరణం, షిప్పింగ్ కార్పోరేషన్కు ముకుల్ రాయ్, జైరాం రమేష్కు గ్రామీణాభివృద్ధి, విలాస్ రావు దేశ్ముఖ్కు సైన్స్ అండ్ టెక్నాలజీ, సుదీప్ బందోపాధ్యాయకు హెల్త్ అండ్ ఫ్యామిలీ, వీరప్ప మొయిలీకి కార్పోరేట్ ఎఫైర్ మినిస్టర్, సుదీప్ బందోపాధ్యాయ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. కాగా జైపాల్ రెడ్డి శాఖ మార్చలేదు. కిషోర్ చంద్రదేవ్కు కేబినెట్ హోదా కల్పించడంతో రాష్ట్రానికి రెండో కెబినెట్ పదవి లభించినట్లయింది. సాయి ప్రతాప్, ఎంఎస్ గిల్, హ్యాండిక్, కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్, దయానిధి మారన్ తదితర ఆరుగురిని మంత్రివర్గం నుండి తొలగించారు. వాణిజ్య శాఖ మంత్రిగా ఆనంద్ శర్మను తీసుకున్నారు. ఇందులో కొందరికి శాఖలు మార్పిడి చేశారు. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా పని చేసిన వీరప్ప మొయిలీని న్యాయశాఖ మంత్రి నుండి కార్పోరేట్ ఎఫైర్ మినిస్టర్ శాఖకు మార్చారు.