హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ముఖ్యమంత్రి సీరియస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సమర్పించిన నివేదికపై ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. నివేదికలో పారదర్శకత లేదని ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. సత్య సాయి ట్రస్టు వ్యవహారాలపై పది రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ట్రస్టు దేవాదాయ శాఖకు తన నివేదికను సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ట్రస్టు సభ్యులు చాలా బాధ్యతారహితమైన నివేదికను సమర్పించారని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతన్నారు.

సత్య సాయి సెంట్రల్ సత్యదూరమైన నివేదికను సమర్పించిందని ఆయన అన్నట్లు చెబుతున్నారు. సమగ్ర నివేదికను సమర్పించాలని ట్రస్టును ఆదేశించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ట్రస్టు సమర్పించిన నివేదికపై పరిశీలనకు ఆర్థిక నిపుణులకు అప్పగించారు. ప్రశాంతి నిలయంలోని యజుర్వేద మందిరం నుంచి 34 కోట్ల రూపాయలు తరలిస్తూ పట్టుబడిన నేపథ్యంలో ట్రస్టు సభ్యులపై తీవ్ర అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది.

English summary
It is said that CM Kiran Kumar Reddy expressed his unhappiness on Sri Sathya Central Trust report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X