వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవిష్యత్తులో దాడులని నిరోధించడానికి అన్నీ చేస్తాం: పిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
ముంబై: ఉగ్రవాద దాడులను నిరోధించడానికి చేయాల్సిందంతా చేస్తామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. దాడులకు పాల్పడినవారికి శిక్ష పడేలా చూస్తామని ఆయన అన్నారు. ముంబై దాడులను కిరాతక చర్యగా ఆయన అభివర్ణించారు. పరిస్థితిని పరిశీలించడానికి ఆయన గురువారం ముంబై వచ్చారు. ముంబై ప్రజల బాధను, ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు రెండు లక్ష రూపాయలేసి, గాయపడినవారికి లక్ష రూపాయలేసి నష్టపరిహారాన్ని తాను ప్రకటించినట్లు ఆయన గుర్తు చేశారు.

ఉగ్రవాదుల కిరాతక చర్యలను ఖండించడానికి తన వద్ద పదాలు లేవని ఆయన అన్నారు. యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి వచ్చిన ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముంబై ప్రజలకు సంఘీభావం ప్రకటించడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. దాడులకు పాల్పడినవారికి శిక్ష పడేలా చూడడంలో కేంద్ర హోం మంత్రి చిదంబరం, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సమన్వయంతో పనిచేస్తారని ఆయన చెప్పారు. తమ కృషిలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజలను విభజించి, జీవన విధానాన్ని దెబ్బ తీయడానికి ఐక్యత, శక్తి పనిచేస్తాయని ఆయన అన్నారు.

English summary
Strongly condemning the "barbaric" bomb blasts here, Prime Minister Manmohan Singh on Thursday said the perpetrators must be pursued relentlessly to bring them to justice quickly and promised the government will do everything in its power to prevent such attacks in future
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X