వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు అందరినీ ఒప్పించాల్సిందే: మర్రి మాట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Marri Sasidhar Reddy
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు అందరినీ ఒప్పించాలని సనత్ నగర్ శాసససభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి గురువారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణకు తాను కట్టుబడి ఉన్నానని అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలంటే కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పినట్టు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభిప్రాయాలు కావాలని, ఎవరైనా కాదంటే వారిని ఒప్పించాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేయనంత మాత్రాన తెలంగాణ ద్రోహులు కాదన్నారు.

తెలంగాణ అంశం చాలా జఠిలమైనదన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన తెలంగాణ రాదన్నారు. 48 గంటలు దీక్ష చేపట్టిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దీక్ష చేస్తున్న విద్యార్థులు తమ దీక్షను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై అధిష్టానానికి డెడ్ లైన్లు పెట్టడం సరికాదన్నారు. అధిష్టానం పరిష్కారం గురించి ఆలోచిస్తుందని అందుకు సమయం ఇవ్వాలని ఆయన సూచించారు.

English summary
Sanathnagar mla Marri Sasidhar Reddy supported union minister Ghulam Nabi Azad comments on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X