అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయి సమాధి సమీపంలో నాగుపాము

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: పుట్టపర్తి ప్రశాంత నిలయంలో మరోసారి నాగుపాము హల్ చల్ చేసింది. శుక్రవారం గురుపౌర్ణమి సందర్భంగా ట్రస్టు సభ్యులు భక్తులకు బాబా మహాసమాధి దర్శన భాగ్యం కల్పించారు. అయితే ఉదయం భారీగా భక్తులు మహా సమాధి దర్శనానికి వేచి చూస్తున్న సమయంలో ఓ నాగుపాము ప్రశాంతి నిలయంలో తచ్చాడుతూ కనిపించింది. అయితే బాబానే నాగుపాము రూపంలో తమకు దర్శనం ఇచ్చారని భక్తులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం గురుపౌర్ణమి రోజు బాబా భక్తులకు దర్శనం ఇచ్చేవారు.

ఇప్పుడు బాబా శివైక్యం చెందిన కారణంగా నాగుపాము రూపంలో తమకు దర్శనమిచ్చాడని భక్తులు భావిస్తున్నారు. పుట్టపర్తికి, నాగుపాముకు ఏదో సంబంధం ఉందని అందుకే ప్రశాంతి నిలయంలో పలుమార్లు నాగుపాము కనిపిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా గత ఏప్రిల్ 24వ తేదిన సైతం బాబా వ్యక్తి గత వైద్యుడు సఫాయా ఇంట్లో ఓ నాగుపాము కనిపించిన విషయం తెలిసిందే.

English summary
Sathya Sai Baba devotees found Naga snake at Prashanthi nilayam today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X