వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా ఆస్తులపై విచారణ జరగాలి: మారెప్ప

By Pratap
|
Google Oneindia TeluguNews

Mareppa
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై కాంగ్రెసు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మూలింటి మారెప్ప విరుచుకుపడ్డారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆస్తులపై కూడా విచారణ జరగాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సోనియా ఆస్తులపై ఫారిన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థతో విచారణ జరిపించాలని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా ఆయన అభివర్ణించారు. సోనియా ఆస్తులపై ప్రైవేట్ సంస్థతో విచారణ జరిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో పందికొక్కుల్లా దోచుకున్న మంత్రులు, నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తే గెలవలేమనే భయంతో జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. సోనియా వేరే దేశం నుంచి మనల్ని పాలిస్తున్నారని ఆయన అన్నారు.

English summary
YSR Congress party leader Mareppa demanded enquiry on Sonia gandhi's properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X