మిస్ యూనివర్స్ రేసులో ఆంధ్రా అమ్మాయి
మోడల్గా నైకీ, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లాంటి సంస్థలకు పనిచేయటంతో పాటు ర్యాంప్వాక్లు కూడా చేసిన ఈమె హాబీగానే మోడల్గా మారానని, దేశం తరపున పాల్గొనాలనే లక్ష్యంతోనే ఈ పోటీలో పాల్గొన్నానని గతంలో ఆమె చెప్పారు. అప్పుడు చెప్పినట్లే మిస్ యూనివర్స్ పోటీలలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు దక్కింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన బ్రెజిల్లోని సావోపౌలోలో జరిగే మిస్ యూనివర్స్ 2011 పోటీలలో ఆమె మన దేశం తరఫున పాల్గొంటుంది. దేశం గర్వపడేలా మిస్ యూనివర్స్ టైటిల్ను తీసుకొస్తానన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా వాసుకి వ్యక్తం చేశారు. అయామ్ షీ పోటీలలో భోపాల్కు చెందిన పరుల్ దుగ్గల్ ఫస్ట్ రన్నరప్గాను, ముంబైకి చెందిన తన్వి సింగ్లా సెకండ్ రన్నరప్గాను నిలిచారు. గతంలో మిస్ యూనివర్స్గా నిలిచి, అనంతరం సినీనటిగా మారిన సుస్మితా సేన్ చేతుల మీదుగా వాసుకి మిస్ యూనివర్స్ ఇండియా-2011 కిరీటాన్ని అందుకున్నారు.