హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై అమ్మ చెప్పలేదు: అంజన్ కుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anjan Kumar Yadav
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై అమ్మవారిని తాము అడగలేదని అమ్మవారు ఏమీ చెప్పలేదని సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ సోమవారం చెప్పారు. కాగా అంతకుముందు అల్లకల్లోలానికి కారణం ప్రజల తప్పులే కారణమని అమ్మవారు రంగంలో చెప్పారు. రంగం భవిష్యత్తును స్వర్ణలత చెప్పారు. మీలో మీరు కొట్టుకుంటున్నారని అన్నారు. ఆలయానికి సరైన కట్టడం సైతం లేదన్నారు. అందుకే మీకు ఇన్ని కష్టాలని చెప్పారు. నేను పెట్టేదాన్నే కానీ కొట్టేదాన్ని కాదని అన్నారు. ప్రజలు ధనం, మదంతో వ్యవహరిస్తున్నారని అన్నారు.

ప్రజలు తప్పులు చేసినప్పటికీ వారిని సరిదిద్ది కాపాడుతానని అన్నారు. నేను ఆగ్రహించడం లేదన్నారు. ఆగ్రహిస్తే అల్లకల్లోలమవుతుందన్నారు. నా బిడ్డలందరినీ కాపాడతానని చెప్పారు. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. నా ప్రజలు సంతోషంగా ఉండటమే నాకు సంతోషం అన్నారు. నా వాళ్లు కష్టాలు పడకుండా కుంభవృష్టి కురిపిస్తానని చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చేస్తానని అన్నారు. కాగా రంగం అనంతరం పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

English summary
MP Anjan Kumar Yadav said today that they were not asked about Telangana. Swarnalatha was told Bhavishyavani today at Ujjaini Matha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X