పార్టీ పెట్టినందుకే తప్పుడు కేసులు: వైయస్ జగన్
వైయస్ రాజశేఖర రెడ్డి మరణించి రెండేళ్లైనా పేదవారికి ఒక్క రేషన్ కార్డు, ఇళ్లు కాంగ్రెసు ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. వైయస్ పథకగాలు అమలు చేసేందుకు ఏ ఒక్క కాంగ్రెసు నేత కూడా ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. కాగా ఓదార్పు యాత్రలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత వైయస్ పథకాలు నిజమైన పేదలకు చేరాలంటే జగన్కే సాధ్యమని అన్నారు. తనకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి వైయస్ అవకాశం ఇచ్చారని అన్నారు. జగన్ అడుగుజాడల్లో నడుస్తానని ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఓదార్పు యాత్రలో ఎమ్మిగనూరు శాసనసభ్యుడు చెన్నకేశవరెడ్డి, టిడిపి అసమ్మతి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
ys jagan odarpu yatra kurnool వైయస్ జగన్ కాటసాని రాంభూపాల్ రెడ్డి చెన్నకేశవ రెడ్డి ఓదార్పు యాత్ర కర్నూలు
English summary
YSR Congress party president YS Jaganmohan Reddy blamed Congress party for CBI probe on his properties.
Story first published: Monday, July 18, 2011, 14:18 [IST]