హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధానిలో వరుస కిడ్నాప్‌లు, ఒకేరోజు ఇద్దరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఒకేరోజు ఇద్దరు పిల్లలను అపహరించిన సంఘటన రాజధాని హైదరాబాదులోని శంషాబాదు పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. శంషాబాదులోని పరిమళ కుమారి అనే ఎనిమిదేళ్ల చిన్నారి మంగళవారం ఉదయం కిడ్నాప్‌కు గురయింది. పరిమళ తల్లిదండ్రులు శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు తమ కూతురును ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. అయితే బంధువుల పైనే వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా వినోద్ కుమార్ అనే పద్నాలుగేళ్ల బాలుడిని సైతం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వినోద్ తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వినోద్‌ను కిడ్నాప్ చేశామని, డబ్బులు ఇస్తే విడిచి పెడతామని తనకు పోన్ వచ్చిందని బాలుడి తల్లి మంజుల పోలీసులకు తెలిపింది. ఓ మోటారు సైకిలు పైన ఇద్దరు వ్యక్తులు వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు వారు చెబుతున్నారు. ఒకేరోజు ఇద్దరు పిల్లలు కిడ్నాప్‌కు గురి కావడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా సోమవారం సాయంత్రం ప్రవళిక అనే పద్నాలుగేళ్ల అమ్మాయి సైతం మిస్ అయినట్లు తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

English summary
Two childrens kidnapped at Samshabad of Hyderabad today. Kidnappers demanding Rupees for release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X