విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిని ప్రాసిక్యూట్ చేయాలి: జయప్రకాశ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
విజయవాడ: ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించే నేతలను ప్రాసిక్యూట్ చేయాలని లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గురువారం అన్నారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో మాట్లాడటానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పలు పార్టీల ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న భాష, చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయని అన్నారు. వారి మాటలు ఉగ్రవాదులు, విధ్వంసకారులను తలదన్నేలా ఉన్నాయన్నారు. ఉద్రిక్తలు పెంచే విధంగా మాట్లాడుతున్న నాయకులను ఆయా పార్టీల నేతలు కట్టడి చేయాలని సూచించారు.

ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని అవమానపరిచేలా మాట్లాడుతున్న వారిని తక్షణం విచారించి జైల్లో పెట్టాలన్నారు. రాష్ట్రం విడిపోయినా, కలిసి ఉన్న ప్రజల చేత ఎన్నికైన నేతలు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని లోకాయుక్త పరిధిలోకి తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా పది లక్షల లేఖలు కేంద్రానికి రాయాలని ఆయన అన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని చంపేయాలని చూస్తుందని ఆరోపించారు.

English summary
Lok Satta president Jaya Prakash Narayana demanded government that to prosecute who are giving hard statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X