హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రస్టులో నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ శివమేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
హైదరాబాద్: భగవాన్ సత్యసాయి బాబా స్థాపించిన సత్య సాయి ట్రస్టు కార్యాలయాలలో భారీగా సంపద బయట పడుతున్న విషయం తెలిసిందే. బాబా నివసించిన యజుర్మందిరంలో గత నెల ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో భారీగా నిధులు, వెండి, బంగారం బయటపడింది. లెక్కింపుకు ముందు, లెక్కింపు సమయంలో ట్రస్టు సభ్యుల సంపదను చాటుగా తరలించారనే తీవ్ర ఆరోపణలు రావడంతో అధికారులు ప్రభుత్వ అధికారులు యజుర్మందిరంలో మరోసారి సోదాలు చేశారు. అప్పుడు సైతం భారీగానే సంపద బయటపడింది. ఆ తర్వాత ట్రస్టు సభ్యులు బెంగుళూరులోని సత్యసాయి వేసవి విడిది వైట్ ఫీల్డులో చేసిన సోదాలలో వందల కిలోల కొద్ది బంగారం, వెండి, 80 లక్షలకు పైగా డబ్బు దొరకింది.

అయితే యజుర్వేద మందిరం, వైట్ ఫీల్డు తర్వాత అధికారులు హైదరాబాదులోని శివం మందిరంలో సోదాలు నిర్వహిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సత్యసాయి చాలా ఆలయాలు నిర్మించారు. అందులో చెన్నై, ముంబయి, హైదరాబాదులోని సత్యం, శివం, సుందరం ఆలయాలు. హైదరాబాదులోని శివంలో సైతం సంపద ఉందా అనే అధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. యజుర్మందిరంలో భారీగా సంపద బయటపడటం, ఆ తర్వాత సత్యసాయి నిర్మించిన పలు ఆలయాల్లో నిధులు ఉండవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఇటీవల శివంలో దొంగలు సైతం పడ్డారు. అయితే వారికి వెండి పూజా సామాను మాత్రమే దొరికింది.

English summary
Some people are suspecting that government will be search in Sivam which is in Hyderabad soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X