ట్రస్టులో నెక్ట్స్ టార్గెట్ హైదరాబాద్ శివమేనా?
అయితే యజుర్వేద మందిరం, వైట్ ఫీల్డు తర్వాత అధికారులు హైదరాబాదులోని శివం మందిరంలో సోదాలు నిర్వహిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సత్యసాయి చాలా ఆలయాలు నిర్మించారు. అందులో చెన్నై, ముంబయి, హైదరాబాదులోని సత్యం, శివం, సుందరం ఆలయాలు. హైదరాబాదులోని శివంలో సైతం సంపద ఉందా అనే అధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. యజుర్మందిరంలో భారీగా సంపద బయటపడటం, ఆ తర్వాత సత్యసాయి నిర్మించిన పలు ఆలయాల్లో నిధులు ఉండవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఇటీవల శివంలో దొంగలు సైతం పడ్డారు. అయితే వారికి వెండి పూజా సామాను మాత్రమే దొరికింది.
Comments
English summary
Some people are suspecting that government will be search in Sivam which is in Hyderabad soon.
Story first published: Thursday, July 21, 2011, 12:18 [IST]