హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భేటీలతో ముఖ్యమంత్రి మంచివాడనుకున్నాం: టిఈజెఏసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Swamy Goud
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తాము చాలాసార్లు భేటీ అయ్యామని ఆయన ఎంతో ఓర్పుగా మాట్లాడుతారని దానిని చూసి ఆయన మంచి వాడనుకున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నేత స్వామిగౌడ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ముఖ్యమంత్రి సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా ఉద్యోగులపై ఏస్మా ప్రయోగం చేయాలని నిర్ణయించుకోవడం సరికాదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు చర్చలు జరపాల్సింది పోయి బెదిరింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. బెదిరింపులతో అణగదొక్కాలనుకోవడం నీచమైన చర్య అన్నారు.

తమకు ఎస్మా గిస్మా జాన్తా నహీ అన్నారు. ఎస్మాకు భయపడేది లేదన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా తాము ఎలాంటి వాటనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. శుక్రవారం ప్రభుత్వం, ప్రైవేటు ఉద్యోగులతో భేటీ అవుతామని చెప్పారు. సమ్మె విషయంలో ఎలాంటి బెదిరింపులకు లొంగేది లేదని తెలంగాణ సచివాలయ ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి. సచివాలయం నుండి గ్రామ పంచాయతీ వరకు అన్నింటినీ స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఏస్మాకు భయపడమన్నారు.

English summary
Telangana employee jac convenor Swamy Goud blamed CM Kiran Kumar Reddy on ESMA experiment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X