వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయి బాబాకు సుగంధ ద్రవ్యాలపై మక్కువ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్య సాయి బాబు నివాసం యజర్ మందిరంలో అధికారులకు ఆసక్తికరమైన వస్తువులు కనిపించాయి. సత్యసాయి బాబా వ్యక్తిగత వస్తు సముదాయం వారి కంట పడింది. మూడు విడతలపాటు అధికారులు యజుర్ మందిరంలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భారీగా బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, నగదు బయటపడ్డాయి. వాటితో సత్యసాయి బాబు వ్యక్తిగత వస్తు సముదాయం కూడా బయటపడింది. దిగుమతి చేసుకున్న షేవింగ్ కిట్లు, సుగంధ ద్రవ్యాలు, సెంట్లు, టాయిలెట్రీస్, షాంపులు, సబ్బులు, నాప్‌కిన్స్ బయటపడ్డాయి. వివిధ దేశాలకు చెందిన ఖరీదైన గడియారాలు కూడా బయటపడ్డాయి. సత్య సాయిబాబాకు సుగంధ ద్రవ్యాలు చాలా ఇష్టమని, భక్తులకు దర్శనమిచ్చే ముందు అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన సుగంధ ద్రవ్యాలు వాడేవారని అంటారు. సాయి బాబా పడక బంగారంతోనో వెండితోనో చేసింది కాదని తేలిపోయింది. గాలితో నింపిన ఆధునిక పడక మాత్రమే ఉంది. అది ఏ దిశలోనైనా తిరగడానికి వీలుగా ఉంది.

మందిరంలో ఐదు వేలకు పైగా గడియారాలు బయటపడ్డాయి. బంగారం రింగులతో పాటు పది వేలకు పైగా ఖరీదైన చీరలు కూడా బయటపడ్డాయి. పెద్ద యెత్తున ధోవతులు కూడా కనిపించాయి. యజుర్ మందిరంలోకి సత్య సాయిబాబా ట్రస్టు సీనియర్ సభ్యులను, కుటుంబ సభ్యులను కూడా అనుమతించేవారు కారు. సత్యసాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ మాత్రమే వెళ్లగలిగేవాడని చెప్తారు.

English summary
Apart from recovering a staggering haul of gold, silver jewellery, diamonds and cash from various rooms during three rounds of inventories, the officials had also stumbled upon interesting personal belongings of Sathya Sai Baba in his Yajur Mandir residence in PrasanthiNilayam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X