వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధింపులతో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prakasam District
ఒంగోలు: కళాశాల యాజమాన్య వేధింపుల కారణంగా నర్సింగ్ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. మార్కాపురంలోని ట్రినిటీ ఒకేషనల్ కళాశాలలో రాజేశ్వరి అనే అమ్మాయి చదువుతోంది. కళాశాల యాజమాన్యం రాజేశ్వరిని ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకు రావాలని సూచించింది. ఆదాయ ధృవీకరణ పత్రం వెంటనే కావాలను రాజేశ్వరిని యాజమాన్యం వేధించినట్లుగా తెలుస్తోంది. అయితే తహసీల్దారు ఆఫీసులో మాత్రం సోమవారం లేదా మంగళవారం ఆదాయ ధృవీకరణ పత్రం ఇస్తామని చెప్పినప్పటికీ యాజమాన్యం మాత్రం వెంటనే కావాలని ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తోంది.

దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన రాజేశ్వరి ఆదివారం హాస్టల్ భవనంలో ఉరి వేసుకొని చనిపోయింది. కాగా రాజేశ్వరి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి తాగుడుకు బానిసై కూతురును పట్టించుకోక పోవడంతో కొన్నాళ్లు మేనమామ వద్ద ఉంటూ చదువుకుంది. మేనమామ చదివించలేని పరిస్థితుల్లో హాస్టల్లో వేసినట్లుగా తెలుస్తోంది. కాగా దర్శి మండలంలోని చందలూరులో తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త రోజూ మందు తాగి వచ్చి వేధించిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
A Nursing girl student committed suicide today in Markapuram of Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X