వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భేటీకి తెలంగాణ మంత్రులు డుమ్మా, డిసిఎం హాజరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sridhar and Saraiah
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల సమ్మె నోటీసుపై చర్చించడానికి గురువారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశానికి తెలంగాణ మంత్రులు డుమ్మా కొట్టారు. ఈ ఉప సంఘంలో ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ముగ్గురు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సమావేశానికి హాజరయ్యారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా హాజరు కాలేదు. ఆయన గైర్హాజరుకు కారణం తెలియడం లేదు.

కాగా, తెలంగాణకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, సారయ్య, ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ సమావేశానికి గైర్హాజరయ్యారు. తాము ఈ సమావేశానికి హాజరు కాబోమని శ్రీధర్ బాబు, సారయ్య ముందే చెప్పారు. అధికారిక సమాచారం అందించనందు వల్ల ముఖేష్ గౌడ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యలపై జ్యుడిషియల్ కమిషన్‌కు నివేదించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులకు చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సమ్మె నోటీసుపై మరోసారి చర్చిస్తామని ఆయన చెప్పారు. ఇదిలా పుంటే, ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి కూడా హాజరు కాలేదు.

English summary
Telangana ministers ignore sub committe meeting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X