గాలి బ్రదర్స్పై టిడిపి అధినేత చంద్రబాబు ఆటాక్
కాంగ్రెసుపై కూడా ఆయన తీవ్ర ధ్వజమెత్తారు. కాంగ్రెసు అవినీతిని ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. మన్మోహన్ సింగ్ను ఆయన చేతకాని ప్రధానిగా ఆయన అభివర్ణించారు. అవినీతిపరులు దేశాన్ని కొల్గగొడుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. అవినీతిపరులను కాంగ్రెసు వెనకేసుకొస్తోందని ఆయన అన్నారు. సివిసిగా థామస్ నియామకమే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వంపై కోర్టు ఎన్నో సార్లు మొట్టికాయలు వేసిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కాంగ్రెసు బేఖాతరు చేస్తోందని ఆయన అన్నారు. దర్యాప్తు సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుందని ఆయన ఆరోపించారు. డబ్బులతో రాజకీయం చేయడం మంచిది కాదని, తమిళనాడు ఎన్నికల్లో అవినీతి సొమ్ము పంచి అడ్రస్ లేకుండా పోయారని ఆయన అన్నారు. ప్రధానిని కూడా లోక్పాల్ పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
chandrababu naidu telugudesam gali brothers hyderabad చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మైనింగ్ మాఫియా హైదరాబాద్
English summary
TDP president N Chandrababu lashed out at Karnataka ministers Gali brothers in mining deals.
Story first published: Friday, July 29, 2011, 14:37 [IST]