వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంపిలకు మనీష్ తివారీ హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwary
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసిన తమ పార్టీ తెలంగాణ ప్రతినిధులకు ఎఐసిసి అధికార ప్రతినిధి మనీష్ తివారీ సూచనలాంటి హెచ్చరిక చేశారు. అధిష్టానంతో తెంచుకునే దాకా తెచ్చుకోవద్దని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ పార్లమంటు సభ్యులకు సూచించారు. రాజీనామాలు చేసి పార్లమెంటుకు రాకపోవడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు పార్లమెంటుకు వస్తే తెలంగాణ అంశంపై ప్రస్తావించడానికి అవకాశం వస్తుందని, ఆ అవకాశాన్ని వదులుకోవడం సరైంది కాదని అన్నారు.

తెలంగాణ సమస్యపై చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ఎంపిలు సహనం కోల్పోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. చర్చల ప్రక్రియ సాగుతోందని, ఓపిక పట్టడం మంచిదని, సహనం కోల్పోవడం ద్వారా సమస్యను జఠిలం చేయవద్దని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుల రాజీనామాపై స్పీకర్‌దే తుది నిర్ణయమని ఆయన అన్నారు.

English summary
AICC spokes person Manish Tiwary suggested resigned Telangana MPs to attend Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X