వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌తో కెసిఆర్ రాజకీయం చేస్తున్నారు: మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupally Narasimhulu
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయం చేస్తున్నారని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు సోమవారం విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టిటిడిపి ఇందిరాపార్కు వద్ద ఒక్క రోజు దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కెసిఆర్ విషం తాగి చనిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. కెసిఆర్ అలా చనిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని కెసిఆర్ గుర్తించాలన్నారు. వ్యవస్థలపై నమ్మకం పోకముందే అధిష్టానం తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని మరో నేత దేవేందర్ గౌడ్ అన్నారు.

రాజకీయ స్వార్థం వదిలి పెట్టి అందరూ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేయాలని మరో నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా టి-టిడిపి నాలుగు తీర్మానాలు ప్రవేశ పెట్టి వాటని ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్రం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలనేది మొదటి డిమాండ్. ముఖ్యమంత్రి మొండిగా వెళ్లకుండా 14ఎఫ్ రద్దు చేసిన తర్వాతనే ఎస్ఐ పరీక్షలు నిర్వహించాలనేది రెండో డిమాండ్. తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ మరోసారి రాజీనామాలు చేయాలనేది మూడోది. రాజీనామాలతో రాజ్యంగ సంక్షోభం సృష్టించాలనేది చివరి డిమాండ్.

English summary
TDP senior mla Mothkupalli Narasimhulu blamed TRS chief K Chandrasekhar Rao today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X