అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అజ్ఞాతంలోకి ఎందుకెళ్లాడో తెలియదు: చమన్ భార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Anantapur District
హైదరాబాద్: తన భర్త అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాడో తనకు తెలియదని పరిటాల రవి అనుచరుడు చమన్ భార్య రమీజా బేగం అన్నారు. ఆమె మంగళవారం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. చమన్ లొంగిపోయాడని తెలుసుకుని ఆమె అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామం నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. తన భర్త చమన్‌ను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు తనను కలుసుకోలేదని ఆమె చెప్పారు.

రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఏమైనా సమస్యలు ఎదురవుతాయని అనుకుని పరిటాల రవి హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని ఆమె అన్నారు. చమన్ ఆరోగ్యం బాగా లేదని అంటున్నారని, తాను హైదరాబాదు బయలుదేరుతున్నానని ఆమె చెప్పారు. చమన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. పరిటాల అనుచరుడు, పలు కేసుల్లో నిందితుడు చమన్ మంగళవారం డిజిపి దినేష్ రెడ్డి ముందు పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే.

English summary
Paritala Ravi's follower Chaman wife Rameeza Begum said that she was not aware why her husband went under ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X