హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతిపై కత్తితో దాడి: ప్రేమికుడు ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాజధానిలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకోవాలని గత కొంతకాలంగా వేధిస్తూ వస్తున్న ఓ యువకుడు సోమువారం రాత్రి యువతిపై కత్తితో దాడి చేసి అనంతరం అతను విషం తాగి మృతి చెందిన విషాద సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మల్కాజిగిరిలో ఉంటున్న సౌజన్య అనే యువతిని మురళి అనే యువకుడు గత కొంతకాలంగా తనను పెళ్లి చేసుకోమని వేధించసాగాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. వీరిద్దరూ న్యూఢిల్లీలో చదివేవారని సమాచారం. అప్పటి నుండే సౌజన్యను మురళి ప్రేమించసాగాడని తెలుస్తోంది.

మురళి వేధింపులు తట్టుకోలేక సౌజన్య ఢిల్లీ నుండి వచ్చింది. ఇక్కడ కూడా పెళ్లి కోసం మురళి వేధించసాగాడు. ఆ తర్వాత సౌజన్య ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరింది. మురళీ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఉద్యోగం సైతం మానేసింది. సౌజన్యపై కోపంతో మురళీ సోమవారం రాత్రి మల్కాజిగిరిలోని ఆమె ఇంటికి కత్తితో వెళ్లాడు. ఆమెపై దాడి చేస్తున్న సమయంలో సౌజన్య కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే అపోలో హాస్పిటల్ తరలించారు. దాడి అనంతరం మురళి కూడా విషం తాగాడు. అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మురళి మృతి చెందాడు.

English summary
A Young boy committed for suicide yesterday and he died today in Gandhi Hospital. He attacked his Sowjanya today at Malkajgiri in her residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X