విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేగుంట మోహన్ ప్రసాద్ పరిస్దితి ఆందోళనకరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vegunta Mohan Prasad
విజయవాడ: ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ పరిస్దితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఆయన వయస్సు 85 ఏళ్లు. బ్రెయిన్ హీమరేజ్‌తో బాధపడుతున్న ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కవిత్వంలో ఆయన స్వేచ్ఛావాది. మోగా ప్రసిద్ధుడైన వేగుంట మోహన్ ప్రసాద్ కవిత్వమే ఊపిరిగా జీవించారు. ఆయన స్వస్థలం ఏలూరు సమీపంలోని వడ్లూరు. తండ్రి వెంకట కనకబ్రహ్మం టీచర్.

ఆయన తొలి కవితా సంకలనం చితి- చింత. చివరి కవిత్వం నిషాదం. దీనికి తణికెళ్ల భరణి అవార్డు లభించింది. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశారు. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశారు.

ఆయన ప్రముఖ రచనలు - రహస్తంత్రి, పునరపి మొదలైనవి. తెలుగు కవిత్వాన్ని ఆంగ్ల పాఠకులకు అందించిన ఘనత కూడా ఆయనకు దక్కుతుంది. పలువురు తెలుగు కవుల కవిత్వాన్ని ఆయన ఇంగ్లీషులోకి అనువదించారు. అంతేకాకుండా దేశదేశాల కవులను కరచాలనం పేరుతో తెలుగు పాఠకులకు అందించారు.

English summary
Prominent Telugu poet Vegunta Mohan Prasad passed away. He is popularly known as Mo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X