వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సమ్మె నేపథ్యంలో ఆర్థిక శాఖలో ఎస్మాస్త్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Andhra Pradesh
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఓ శాఖలో ఎస్మాస్త్రం ప్రయోగించింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి చెందిన ఆర్థిక శాఖపై ప్రభుత్వం ఎస్మాస్త్రం ప్రయోగించింది. పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, ఆర్థిక శాఖ తదితర శాఖల్లో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా శాఖలను అత్యవసర సేవల క్రిందకు తీసుకు వచ్చిన నేపథ్యంలో ఆ శాఖల్లో ఎవరూ సమ్మెలు చేయడానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చింది.

కాగా ఈ నెల 8వ తేదిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 17వ తేది వరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక శాఖలో ఎస్మా ప్రయోగించింది.

English summary
Government took government order on ESMA in finance ministry today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X