వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైవ్ స్టార్ హోటళ్లలో కర్నాటక రాజకీయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rajnath Singh-Arun Jaitely
బెంగళూరు: మరికొద్ది సేపట్లో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షం సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకనే సమయంలో కర్నాటక రాజకీయం రసకందాయంగా కనిపిస్తోంది. ఒక్కో వర్గం వారు ఒక్కో హోటళ్‌లో బస చేసి రాజకీయం నెరపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన అనుచరుడు, ఉడిపి పార్లమెంటు సభ్యుడు సదానంద గౌడను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టాలని అధిష్టానంతో పట్టుబడుతున్నాడు. మరోవైపు యడ్యూరప్ప వ్యతిరేక అనంతకుమార్ వర్గం సైతం జగదీష్ షెట్టార్ పేరును అధిష్టానానికి సూచిస్తోంది. దాదాపు సదానంద గౌడ్ పేరు ఖరారయినట్టు బయటకు కనిపించినప్పటికీ అంతర్గతంగా బిజెపిలో రాజకీయం జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

కాపిటల్ హోటల్‌లో బిజెఎల్పీ సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప తన వర్గంతో కలిసి పెవిలియన్ హోటల్లో బస చేశారు. ఆయన వ్యతిరేక అనంతకుమార్ వర్గం అశోక హోటల్లో రాజకీయం నెరపుతున్నట్టుగా సమాచారం. వీరి రాజకీయాలను అధిష్టానం ప్రతినిధులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ మరో హోటల్ మెరిడియన్ హోటల్లో ఉండి వారి రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. యడ్యూరప్పకు చెక్ చెప్పేందుకు ఆయన వర్గానికే చెందిన షెట్టార్ పేరును అనంతకుమార్ వర్గం ప్రతిపాదిస్తోంది. ఎవరికి వారు తమకు ఎక్కువ మెజారిటీ ఉందని అధిష్టానం వద్ద చెప్పుకునేందుకు ఎవరికి వారు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Karnataka political drama is going in five star hotels. BJPLP will elect chief minister today in capital hotel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X