ఆజాద్! నాటకాలు వద్దు: కె కేశవరావు గుస్సా
మాట్లాడిందే మాట్లాడటం వల్ల లాభం లేదని తాము సోనియాకు తేల్చి చెబుతామని అన్నారు. 6వ తేదిలోగా రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని జెఏసి డిమాండ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. వాళ్లు తమకు బాసులు కాదన్నారు. వారి చెప్పినట్లు వినాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు సంక్లిష్ట అంశాలపై చర్చకు పట్టుబట్టి ఓటింగుకు కోరినప్పుడు పార్లమెంటుకు వెళ్లే అంశాన్ని ఆలోచిస్తామని చెప్పారు. తాము రాజీనామా చేసింది ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే కాని కూల్చడానికి కాదన్నారు. రాజీనామాలు ఆమోదించాలని సభాపతిని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తమకు వ్యతిరేకత లేదన్నారు. కొన్ని ప్రచార సాధనాలు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన కుమారుడితో సమానమని అన్నారు. 14ఎఫ్ పై ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గానీ ఢిల్లీ వచ్చి మాట్లాడాలని సూచించారు.