హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిచ్చి పనులు చేస్తే చంపేస్తాం: శంకరరావుకు బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావుకు బుధవారం మరోసారి బెదిరింపు ఫోన్‌లు వచ్చాయి. తనకు బెదిరింపు పోన్లు వచ్చాయని సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో శంకరరావు ఫిర్యాదు చేశారు. పిచ్చి పిచ్చి పనులు మానుకోకుంటే చంపేస్తామని ఆయనకు బెదిరింపు ఫోన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవల శంకరరావు చేస్తున్న ఆరోపణలు, ప్రకటనలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. లేదంటే చంపేస్తామని బెదిరించినట్లుగా తెలుస్తోంది. తీవ్రంగా దుర్భాషాలాడారు. మరో ఐదు నిమిషాల తర్వాత కూడా ఫోన్ చేసి అలాగే హెచ్చరించినట్లు తెలుస్తోంది. శంకరరావు ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు 3 జట్లను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందనే తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు. అయితే నగర శివార్ల నుండే ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

కాగా గతంలోనూ శంకరరావుకు పలుమార్లు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. తనకు బెదిరింపు కాల్సు వస్తే పోలీసులు ఏమీ చేయలేదని శంకరరావు గతంలో విరుచుకు పడ్డారు. కాగా లోకాయుక్త తనకు సమన్లు జారీ చేయడంపై శంకరరావు స్పందించారు. తన ఆస్తుల వివరాలు లోకాయుక్త అడగడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. లోకాయుక్త చెప్పిన గడువు కంటే పదిరోజుల ముందే తన ఆస్తుల వివరాలను సమర్పిస్తానని చెప్పారు. ఆస్తుల వివరాలు పారదర్శకంగా అందిస్తానని అన్నారు. అయితే తనకు అధికారికంగా ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. మీడియాలోనే చూస్తున్నానని చెప్పారు.

English summary
Minister Shankar Rao received threat call today. He complaint in CCS police. Police sent three teams to find out about calls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X