హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి కనిపించడం లేదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

S Jaipal Reddy
హైదరాబాద్: కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి గత కొన్నాళ్లుగా కనిపించడం లేదంటూ ఆయన సొంత నియోజకవర్గం తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి గురువారం శంషాబాద్ విమానాశ్రయం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇటీవల తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన కనిపించకుండా పోయారని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడియాతో అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేసి పోరాటం చేస్తున్న సమయంలో జైపాల్ రెడ్డి కనిపించడం లేదని అన్నారు.

జైపాల్ రెడ్డి వెంటనే తన మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. కాగా ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సైతం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి తార్నాక వైపు వెళుతుండగా వారిని పోలీసులు అడ్డగించారు. విద్యార్థులు ఓయు పిఎస్ ముందు ఆందోళన చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీలో సీనియర్ నాయకుడు, అధిష్టానం వద్ద పలుకుబడి గల జైపాల్ రెడ్డి తెలంగాణపై స్పష్టంగా ముందుకు రాక పోవడం తెలంగాణ వాదుల్లో ఆగ్రహం కలిగిస్తోంది.

English summary
Telanganites complainted against central minster Jaipal Reddy in Shamshabad police station today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X