ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోరిక తీర్చలేదని వదిన గొంతు కోసిన మరిది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prakasam District
ఒంగోలు: ఆదరించిన వదిన తన కోరిక తీర్చక లేదని మరిది ఆమె గొంతు కోసి నరికిన సంఘటన ప్రకాశం జిల్లాలోని బింగినపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నరేష్ అనే యువకుడు తన అన్న నర్సింహారావు భార్య పద్మపైన కన్నేశాడు. వదిన పైన కన్నేసిన ఆ కామాంధుడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అయితే అతని చర్యలను తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన నరేష్ ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతి చెందింది. నర్సింహారావు, పద్మలకు ఇద్దరు పిల్లలు. నరేష్ చేసిన అకృత్యం వల్ల ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

నరేష్‌కు పెళ్లయింది. అయితే ఆయన తన భార్యను కొన్నేళ్ల క్రితం హతమార్చాడు. ఇందుకు గాను నరేష్ మూడేళ్లు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించాడు. ఇటీవల విడుదలైన నరేష్‌ను అన్న, వదినలు చేరదీశారు. వారి ఇంట్లోనే ఉండేవాడు. వారింట్లో ఉంటూ అన్నం పెట్టిన వదిన పైన కన్నేశాడు. నరేష్ దశ్చర్యకు ఆగ్రహం చెందిన గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

English summary
A man cutted his brother's wife throat in Prakasam district. He make sexual harassment on her. But she opposed. Police put case on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X