వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై సంప్రదింపులు జరుగుతున్నవి: చిదంబరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతోందని కేంద్ర హోంమంత్రి చిదంబరం శుక్రవారం పార్లమెంటులో చెప్పారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు పక్ష నేత సుష్మా స్వరాజ్ తెలంగాణ అంశంపై సావధాన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యానించారు. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీ ఆరు సూత్రాలు ప్రతిపాదించిందని చెప్పారు. రాష్ట్రంలోని అందరిని సంప్రదించి శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమర్పించిందని చెప్పారు.

నివేదికపై, తెలంగాణ అంశంపైనా అందరితో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు. శ్రీకృష్ట కమిటీ సిఫార్సులను ఆయన లోక సభకు వివరించారు. 14ఎఫ్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14ఎఫ్ రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారని చెప్పారు. కేబినెట్ సైతం రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసిందన్నారు.

English summary
Home Minister Chidambaram said today in Lok Sabha that central government is talking with all partis on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X