వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై టిడిపిని చూపి కాలాయాపన: కావూరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నాటి కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీని బూచిగా చూపెట్టి తెలంగాణపై తప్పించుకుందని ఎంపీ కావూరి సాంబశివరావు పార్లమెంటులో శుక్రవారం అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదన్నారు. కేవలం పరిష్కారం మాత్రమే చూపిస్తామని చెప్పిందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రెండు శాతం ఓట్లు, కనీసం ఒక్క ఎంపీ సీటు లేని బిజెపి తెలంగాణపై మాట్లాడటం విడ్డూరమన్నారు. ఏ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగిందో గణాంకాలు చూస్తే తెలుస్తాయన్నారు.

సుష్మా స్వరాజ్ దేశానికి ప్రతిపక్ష నేతగా కాకుండా తెలంగాణ ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడటం బాధాకరం అన్నారు. తెలంగాణ కోసం అందరు పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయలేదన్నారు. హైదరాబాదు పరిసర ప్రాంతాలలోని ఎంపీలు రాజీనామాలు చేయలేదన్నారు. దివంగత నెహ్రూ వ్యాఖ్యలను సుష్మా తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. కాకినాడ ప్లీనరీలో తెలంగాణ ఇస్తానని చెప్పిన బిజెపి దానిని ఎక్కడ పెట్టిందని ప్రశ్నించారు. కాగా కావూరికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడంపై బిజెపి ప్రశ్నించడంతో తన విచక్షణాధికారంతో అనుమతి ఇచ్చానని స్పీకర్ మీరా కుమార్ చెప్పారు.

English summary
MP Kavuri Sambasiva Rao blamed Bharatiya Janata Party for Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X