ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లయిన అరగంటకే తాళి తెంపి పరారైన వరుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

West Godavari District
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన ప్రేమికురాలని పెళ్లి చేసుకున్న అర గంటకే ఓ ప్రియుడు తాళి తెంపేసి పరారయ్యాడు. జయలక్ష్మి అనే యువతిని వెంకటేష్ అనే యువకుడు శుక్రవారంనాడు ద్వరకా తిరుమలలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తాను ఆమెకు కట్టిన తాళి తెంపేసి పారిపోయాడు. అవమాన భారంతో జయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విజయవాడలోని ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది.

సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - ఫ్యాన్సీ స్టోర్‌లో పనిచేస్తున్న జయలక్ష్మిని పక్కనే ఉన్న బట్టల షాపులో పనిచేస్తున్న వెంకటేష్ ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుందామని అతను జయలక్ష్మిపై గత వారం రోజులుగా ఒత్తిడి తెస్తూ వస్తున్నాడు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పిన జయలక్ష్మి మాటలను అతను పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవాల్సిందేనని బ్లేడుతో కోసుకోవడం వంటి చర్యలకు పూనుకున్నాడు. దీంతో ఆమె ద్వరకా తిరుమలలో పెళ్లికి అంగీకరించింది. పెళ్లి తర్వాత వెంకటేష్ పారిపోవడంతో ఇంటికి వచ్చిన జయలక్ష్మి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

English summary
A youth Venkatesh escaped after marrying his lover Jayalaxmi at Eluru of West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X