అలా చేయడం నాకు చేతకాదు: కొణిజేటి రోశయ్య
తీర్మానం వీగిపోతుందనే విషయాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగుకు తాను చెప్పానని అన్నారు. వీగుతుందని తీర్మానం వద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. గుత్తా సుఖేందర్ లాంటి నేతలు తనను అపార్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశించినా పరిస్థితులను బట్టే తీర్మానం పెట్టలేదని అది పార్టీకి వివరించానని అన్నారు. డిసెంబర్ 9 వరకు పరిస్థితులు మొత్తం సోనియాకు వివరించానని అన్నారు. సోనియాతో మాట్లాడిన అన్ని విషయాలు మీడితో చెప్పలేనని అన్నారు.
ఏకాభిప్రాయంతోనే సమస్య పరిష్కారం అంటే ఏ సమస్యకు పరిష్కారం దొరకదు అన్నారు. తన మిత్రుల్లా తాను ఏ వాదాన్ని భుజాన వేసుకోనని అన్నారు. కలిసుంటే పరస్పరం అర్థం చేసుకొని ఉండాలని, విడిపోవాలనుకుంటే అన్నదమ్ముల్లా విడిపోవాలని సూచించారు. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏకాభిప్రాయం జరిగిందో లేదో చూడాలంటే రికార్డులు పరిశీలించాలని చెప్పారు. తెలంగాణ అంశం రోజు రోజు జఠిలం అవుతుందన్నారు.