వైయస్ జగన్కు చెక్: వారసులకు బొత్స గాలం
మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, ధర్మాన ప్రసాద రావు, ఏరాసు ప్రతాపరెడ్డి, ముఖేష్ గౌడ్, విశ్వరూప్ల కుమారులు కార్తిక్ రెడ్డి, ఫణీంద్ర, రామ్ మనోహర్ నాయుడు, అరవింద రెడ్డి, విక్రమ్ గౌడ్, కృష్ణలతో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అలాగే పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్, శానససభ్యులు నందీశ్వర్ గౌడ్, రాజేంద్రల కుమారులు అనిల్ కుమార్ యాదవ్, ఆశిష్, శ్రావణ్లతో కూడా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మరో పదిహేను రోజుల్లో అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకుల వారసులతో మాట్లాడాలని బొత్స సత్యనారాయణ నిర్ణయించుకున్నారు.
తమకు బొత్స సత్యనారాయణ ఏ విధమైన హామీలు ఇవ్వలేదని, పార్టీకోసం పనిచేస్తామని, అప్పుడు గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నామని, పార్టీలో ఉన్నప్పుడు జగన్ వెంట తిరిగామని, పార్టీని వీడిన తర్వాత జగన్ను కలవడం లేదని సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి చెప్పారు.