సమ్మెపై వెనక్కి తగ్గుతూనే అణచివేతకు యత్నం!
అయితే ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించకూడదనే నిర్ణయానికి ఉపసంఘం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికను ముఖ్యమంత్రికి ఇవ్వనుంది. అయితే ఎస్మాను ప్రయోగించకుండా సర్వీసు రూల్సు కఠినంగా పెట్టాలని ఉపసంఘం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెకు మద్దతు ఇచ్చిన పక్షంలో వారిని విధుల నుండి తప్పించాలనే కఠిన నిర్ణయం తీసుకోవాలని ఉపసంఘం భావిస్తోందని సమాచారం. అలా చేయడం వల్ల సమ్మె ఉధృతిని తగ్గించవచ్చని వారి అభిప్రాయపడుతున్నట్టుగా సమాచారం. సిఎస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించాలని ఉపసంఘం నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. కేంద్రం నిర్ణయం వచ్చే వరకు సమ్మెను వాయిదా వేసుకోవాలని ఉపసంఘం ఉద్యోగులను కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎస్మా ప్రయోగం లేదని చెప్పినప్పటికీ దానిని సుప్తావస్థన చేతనలో ఉంచాలని సిఎం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.
కాగా ఈ నెల 13న బిహెచ్ఇఎల్లో జరిగే ఎస్సై పరీక్షలను అడ్డుకునే వారిని అరెస్టు చేస్తామని ఐజి రతన్, డిఐజి నాగిరెడ్డి చెప్పారు. ఎస్సై పరీక్షలకు బిహెచ్ఇఎల్లో నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగులు ఐడి కార్డులు తెచ్చుకోవాలని వారు సూచించారు. ఎవరు అడ్డుకున్నా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.