వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెండా పండుగపై మెట్టు దిగిన తెలంగాణ మంత్రులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy and Geetha Reddy
హైదరాబాద్: జెండా పండుగ విషయంలో తెలంగాణ మంత్రులు మెట్టు దిగారు. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని వారు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి మేరకు జిల్లాల్లో జాతీయ పతాకావిష్కరణ చేయడానికి అంగీకరించారు. ఏయే జిల్లాలకు ఏయే మంత్రులు వెళ్లాలనే విషయం కూడా ఖరారైంది. ఆదిలాబాద్ విషయంలోనే ఇంకా సందిగ్ధత ఉంది. అదిలాబాద్‌లో జెండా ఆవిష్కరించాలని వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సారయ్యపై ఒత్తిడి పెరుగుతోంది.

మెదక్ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాదులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. వరంగల్‌లో పొన్నాల లక్ష్మయ్య, రంగారెడ్డిలో సబితా ఇంద్రారెడ్డి, మెదక్‌లో గీతారెడ్డి, కరీంనగర్‌లో శ్రీధర్ బాబు, నిజామాబాద్‌లో సుదర్శన్ రెడ్డి, ఖమ్మంలో రాంరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్‌లో డికె అరుణ జాతీయ పతాకను ఆవిష్కరిస్తారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కె. జానా రెడ్డి వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళ వెళ్లారు. దాంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు.

English summary
Telangana ministers agreed to participate in independence day celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X