నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యే సోదరుడి కోడలు దారుణ హత్య

|
Google Oneindia TeluguNews

Nizamabad District Map
నిజామాబాద్: జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మండవ వెంకటేశ్వరరావు సోదరుడి కోడలు గిరిజ మహారాష్ట్రలోని షిర్డీలో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకు తీగ బిగించి చంపేసినట్లుగా భావిస్తున్నారు. తర్వాత ఆమె మెడలోని నగలు, బీరువాలో ఉన్న ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. ఇది కచ్చితంగా దొంగల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన మండవ అన్న సుబ్బారావు కుటుంబ సభ్యులు కొన్నేళ్లుగా షిర్డీ సాయిబాబా మందిరం పక్కనే మెస్ నడుపుతున్నారు.

గిరిజ రోజూ మధ్యాహ్నం 2 గంటలకు భర్తకు భోజనం తీసుకెళ్లి ఇచ్చేవారు. శనివారం సాయంత్రం వరకు ఆమె రాకపోవడంతో భర్తే ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్జీవంగా ఉన్న గిరిజను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు హైదరాబాద్‌లో ఉన్న రాజా కూతుళ్లను వెంట తీసుకొని షిర్డీ బయల్దేరారు. ఈ ఘటనతో ధర్మారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలో జరిగే శుభకార్యాలకు రాజా దంపతులు తప్పనిసరిగా హాజరయ్యేవారని, ఇటీవల జరిగిన పాఠశాల స్వర్ణోత్సవాలకు కూడా వచ్చారని స్థానికులు తెలిపారు. గిరిజ మృతదేహానికి ధర్మారంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X