వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సచ్ఛీలత నిరూపణకు అవకాశం: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ విచారణ కక్ష సాధింపు చర్యగా, రాజకీయ వేధింపులుగా తాను భావించడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోమవారం అభిప్రాయపడ్డారు. జగన్ సిబిఐ విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరి పైన అవినీతి ఆరోపణలు వారు తమ సచ్ఛీలత నిరూపించుకోవాలని అన్నారు. కొందరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించారని ఆరోపించారు.

అవినీతి ప్రక్షాళకు యువత ముందుకు రావాలని సూచించారు. అవినీతిపై ఉద్యమం చేస్తున్న ప్రముఖ సామాజిక సంస్కర్త అన్నాహజారేకు అందరూ మద్దతు పలకాలని అన్నారు. రాష్ట్రంలో రైతాంగం ప్రకటిస్తున్న పంట విరామంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించాలని అన్నారు. అంతకుముందు మెగాస్టార్ జూబ్లీహిల్సులోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

English summary
PRP president Chiranjeevi said today that YSRC party president YS Jaganmohan Reddy get chance to prove his innocence with CBI probe. Chiranjeevi hausted national flag in blood bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X