తెలంగాణక తిలోదకాలు, కాంగ్రెసు నేతలు రెడీ?
తెలంగాణ ఏర్పాటు డిమాండు ఉద్యమం ఉద్రిక్తతకు దారి తీసిన ప్రతిసారీ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఓ డ్రామాకు తెర తీస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. కాంగ్రెసు ప్రజా ప్రతినిధుల రాజీనామాల వ్యవహారం కూడా ఓ ప్రహసనంగా మారింది. ఇదంతా అధిష్టానం కనుసన్నల్లోనే జరుగుతోందని అంటున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ పేరాను తొలగించడం ద్వారా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు కొంత వెసులుబాటు లభించింది. తద్వారా రాజీనామాల విషయాన్ని వెనక్కి తోసేసి తమ పనులు తాము ప్రభుత్వపరంగా చేసుకుపోవడానికి పూనుకున్నారు.
శ్రీకృష్ణ కమిటీలోని 8వ అధ్యాయంలోని సూచనలను కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు అధిష్టానం పకడ్బందీగా అమలు చేస్తోందని అంటున్నారు. తద్వారా రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను వెనక్కి నెట్టడం అందులో భాగం. అందుకు అనుగుణంగా కాంగ్రెసు తెలంగాణ ప్రాతం నాయకులు నడుచుకోవడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. 2014 వరకు తెలంగాణ అంశాన్ని నాన్చడానికి అవసరమైన ప్రణాళిక కాంగ్రెసు అధిష్టానం వద్ద ఉందని చెబుతున్నారు.