హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తన కేసు వాదించాలని సింఘ్వీని కోరిన వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Abhishek Singhvi
హైదరాబాద్: తన కేసును వాదించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆయన అందుకు నిరాకరించినట్లు చెబుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన అభిషేక్ సింఘ్వీ ప్రముఖ న్యాయవాది. సిబిఐ పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైయస్ జగన్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అది ఇంకా విచారణకు రాలేదు.

హైకోర్టు ఆదేశాల అమలును నిలిపేయాలని కోరుతూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, సుప్రీంకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవపడంతో సిబిఐ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును ముమ్మరం చేసింది. హైకోర్టు ఆదేశాలు అందిన వెంటనే సిబిఐ చాలా వేగంగా కదిలింది. హైదరాబాదులోని నాంపల్లి ప్రత్యేక కోర్టు నుంచి సెర్చ్ వారంట్లు పొందడం దగ్గరి నుంచి సోదాలు నిర్వహించడం వరకు చాలా వేగంగా, పకడ్బందీగా కదిలింది.

English summary
It is said that YSR Congress party president YS Jagan has requested Congress spokesperson Abhishek Singhvi to takeup his case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X