సచివాలయానికి సబిత, తెలంగాణ మంత్రల బాట అదే
కాగా, ప్రభుత్వం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటే పార్లమెంటుకు వెళ్లి ఓటింగులో పాల్గొనాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించుకున్నారు. తెలంగాణపై ఇచ్చిన హామీకి పార్టీ హైకమాండ్ కట్టుబడి ఉండాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తమ పార్లమెంటు సభ్యులంతా ఒకే మాట మీద ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణకు తమ శాశ్వత మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ముందు సీమాంధ్రులు తెలంగాణ ఎందుకు వద్దనే విషయంపై సరైన వాదన పెట్టలేకపోయారని మరో పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. జలవనరుల పంపకంపై వారిచ్చిన ప్రజంటేషన్ నమ్మశక్యంగా లేదని ఆయన అన్నారు. గుంటూరు - ఒంగోలు మధ్య సీమాంధ్ర రాష్ట్రానికి 50 వేల కోట్లతో రాజధానిని ఏర్పాటు చేసుకోవచ్చునని, దానివల్ల సీమాంధ్ర ప్రజలకు మేలు కలుగతుందని ఆయన అన్నారు. వైయస్ జగన్పై సిబిఐ దర్యాప్తులో కక్ష సాధింపు లేదని, హైకోర్టు ఆదేశాల మేరకే దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.