హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి విలీన సభలో సోదరుడు నాగబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagababu
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయాలనే నిర్ణయంతో చిరంజీవికి ఆయన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ దూరమైనట్లు వార్తలను కొట్టిపారేసే సంఘటన చోటు చేసుకుంది. చిరంజీవికి సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ దూరమయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తను కొట్టిపారేసే సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాంగ్రెసు తీర్థం పుచ్చుకునే గాంధీభవన్‌ సమావేశంలో చిరంజీవితో పాటు ఆయన సోదరుడు నాగబాబు కనిపించారు.

నాగబాబుతో పాటు చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. కడప ఉప ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెసుకు మద్దతుగా ప్రచారం చేసినప్పుడు నాగబాబు అక్కడికి వెళ్లారు. చిరంజీవితో పాటు వేదికను పంచుకోలేదు గానీ దూరంగా ఉండి పరిస్థితిని అంచనా వేశారు.

English summary
Chiranjeevi's brother Nagababu attended PRP merger in Congress meeting today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X