తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిటిడి చైర్మన్‌గా చిరంజీవి బావమరిది అల్లు అరవింద్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Aravind
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ పదవిని తన బావ మరిది అల్లు అరవింద్‌కు ఇప్పించేందుకు కాంగ్రెసు పార్టీ కొత్త కాపు చిరంజీవి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. దీంతో పాలక మండలినో, స్పెసిఫైడ్ అథారిటీనో నియమించాల్సి ఉంటుంది. దీంతో పాలక మండలి చైర్మన్‌గా అల్లు అరవింద్‌ను నియమింపజేసేందుకు చిరంజీవి నడుం కట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తిరుపతి శాసనసభ్యుడిగా తనకు ఆ అవకాశం ఇవ్వాలనేది కూడా చిరంజీవి వాదనగా కనిపిస్తోంది.

ఆ విషయంపై చిరంజీవి ఇప్పటికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెవిన కూడా ఆ విషయం వేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవి ఫోన్ చేయించినట్లు సమాచారం. అయితే, అల్లు అరవింద్‌ను టిటిడి చైర్మన్‌గా నియమించడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదని అంటున్నారు. దీంతో టిటిడి చైర్మన్ నియామకాన్ని సోనియా స్వదేశానికి తిరిగి వచ్చేవరకు పెండింగులో పెట్టాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా, నాగబాబును ఏదో కార్పొరేషన్ చైర్మన్‌గా వేయించేందుకు కూడా చిరంజీవి పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.

English summary
According to sources - Chiranjeevi is lobbying for Allu Aravind for TTD chairman post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X