వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ సంతకం ఫోర్జరీ, లోకసభ స్పీకర్‌కు ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యడు కె. చంద్రశేఖర రావు సంతకం ఫోర్జరీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. పార్లమెంటుకు హాజరు కాకపోయినా హాజరైనట్లు కెసిఆర్ సంతకం ఉందని చెబుతున్నారు. ఈ నెల 5వ తేదీన కెసిఆర్ లోకసభకు హాజరైనట్లు సంతకం ఉందని ఓ టీవీ చానెల్ వార్తాకథనం తెలియజేస్తోంది. అసలు ఈ పార్లమెంటు సమావేశాలకు కెసిఆర్ హాజరే కాలేదు.

కెసిఆర్ సంతకం ఫోర్జరీపై తెరాస నాయకులు లోకసభ స్పీకర్ మీరా కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పార్లమెంటు అధికారులు విచారణ జరుపుతున్నారు. కెసిఆర్ సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు. తెలంగాణపై లోకసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. పార్లమెంటు సమావేశాలను కూడా బహిష్కరించారు. ఈ స్థితిలో కెసిఆర్ పార్లమెంటుకు హాజరైనట్లు సంతకం ఉండడంపై అనుమానాలు కలుగుతున్నాయి.

English summary
According to reports - TRS president and MP K Chandrasekhar rao sign is forged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X