వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల రాజీనామాలను పరిశీలిస్తున్నా: నాదెండ్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nadendla manohar
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన 26 మంది శాసనసభ్యుల రాజీనామా లేఖలు తన వద్దకు అందాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం చెప్పారు. వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అసంతృప్తి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాజీనామాపై విచారణ పూర్తయిందని చెప్పారు. నల్లపురెడ్డి సోమవారం సాయంత్రం తన ముందు హాజరు కావాలని ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి రాజీనామాపై విచారణ కొనసాగుతుందని చెప్పారు.

స్పీకర్ నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు. అసెంబ్లీ మీడియా పాయింటును ఎత్తేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే మీడియా పాయింటును అనుమతిస్తామని చెప్పారు. వివిధ పార్టీల ఫిర్యాదు మేరకు ఆయా పార్టీలకు చెందిన ఐదుగురు శాసనసభ్యులకు నోటీసులు పంపినట్లు చెప్పారు. కాగా నోటీసులు పంపిన వారు పలువురు రాజీనామాలు చేసిన వారిలోనూ ఉన్నారు. రాజీనామాల లేఖలపై ఉన్న శాసనసభ్యుల సంతకాలను పరిశీలించాల్సిందిగా అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

English summary
Speaker Nadendla Manohar said today that YSRC party president YS Jaganmohan Reddy camp mlas resignations with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X