సుష్మాపై సీమాంధ్ర ఎంపిల సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సుష్మాస్వరాజ్ ఉటంకించిన విధంగా నెహ్రూ ఎక్కడా మాట్లాడలేదని, ఆమె ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతిపక్ష నాయకురాలు అని,ఆమె మాట్లాడే ప్రతి పదాన్నీ దేశమే కాకుండా ప్రపంచం మొత్తం చూస్తుందని, ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుందని, దాని పరిణామాలు విస్తృతంగా ఉంటాయని, ఆగస్టు 5న ఆమె స్వార్థ ప్రయోజనాలకోసం పాకులాడుతున్న కొందరు తెలంగాణ నాయకుల వలలో చిక్కుకున్నారని, వాళ్లు గత కొన్నేళ్లుగా తెలంగాణ అంశంపై వాస్తవ విరుద్ధమైన ప్రచారం చేస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ చెప్పని విషయాలను కూడా చెప్పినట్లు ఉటంకిస్తున్నారని సీమాంధ్ర ఎంపిలు తమ నోటీసులో అన్నారు.
సుష్మా స్వరాజ్పై ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్రెడ్డి, సబ్బం హరి, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాస్రెడ్డి, రాయపాటి, కావూరి, లగడపాటి, కిల్లి కృపారాణి, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్లు సంతకాలు చేశారు.