హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశవరావు వ్యాఖ్యలపై కాంగ్రెసు ఎమ్మెల్యేల ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుపై ఇద్దరు కాంగ్రెసు శాసనసభ్యులు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విరుచుకుపడ్డారు. తెలంగాణ విలన్ రోశయ్య కాదని, కేశవరావులాంటివారే అసలైన తెలంగాణ ద్రోహులని శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్, మధుసూదన్ గుప్తా అన్నారు. రోశయ్య పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించారనే విమర్శలో నిజం లేదని వారు స్పష్టం చేశారు.

రెండోసారి రాజ్యసభ సీటు కోసమే కేశవరావు తెలంగాణవాదాన్ని ఎత్తుకున్నారని వారు విమర్శించారు. పదవి ఉంటే ఓ మాట, పదవి లేకుంటే మరో మాట అంటారని వారన్నారు. ఏకాభిప్రాయం లేకపోవడం వల్లనే తెలంగాణపై కేంద్రం వెనక్కి తగ్గిందని వారు చెప్పారు. ఇతర నాయకులను కేశవరావు ఎదగనీయడం లేదని వారన్నారు. తెలంగాణపై మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఓ రకంగా, పదవి పోయిన తర్వాత మరో రకంగా మాట్లాడుతున్నారని వారు విమర్శించారు.

English summary
Congress MLAs Amanchi Krishna Mohan and Madhusudan Gupta retaliated Rajyasabha member K Keshav Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X